ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్ లో 92.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగేఇంటర్మీడియట్ జూనియర్ బైపీసీ విద్యార్థులు 90%, జూనియర్ ఎంపీసీ 79.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ రౌతు రమోల తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ లో డి.స్పందన 878, డి.తరణి 875, సీనియర్ బైపిసిలో జి. తేజస్విని 931, ఎస్.రేష్మా 924 మార్కులుఈ సాధించి కాలేజీ లో మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు.
ఇంటర్ లో సత్తాచాటిన పుదూరు గురుకుల కాలేజీ విద్యార్థులు
Related Posts
చదువులో దిట్ట….గోల్డ్ మెడల్ తో పట్టా… బయోటెక్నాలజీలో ఓజిలి విద్యార్థిని ప్రతిభ… పలువురు హర్షం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకుంటూ గోల్డ్ మెడల్…
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో…