ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):తనకు ప్రాణహాని వుందని విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసారు సీబిఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా జేడీ చేసిన ఈ ఫిర్యాదుతో ఒక్కసారిగా అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్కి చేసిన ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారు. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖలో ఉన్నారని, వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారించే తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని, ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉన్నట్టు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ప్రాణహాని పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు
Related Posts
చదువులో దిట్ట….గోల్డ్ మెడల్ తో పట్టా… బయోటెక్నాలజీలో ఓజిలి విద్యార్థిని ప్రతిభ… పలువురు హర్షం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకుంటూ గోల్డ్ మెడల్…
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో…