ప్రభాతదర్శిని ప్రత్యేక-ప్రతినిధి: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని భారత చైతన్య యువజన పార్టీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్లో కోరారు. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని చెప్పారు. రాజీనామాలు ఆమోదిస్తే వారంతా వైకాపాకు అనుకూలంగా ఉంటారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉమేశ్చంద్ర వాదించారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు ఆ అధికారాలు వినియోగించవచ్చని తెలిపారు. పిటిషనర్ వాదనలపై కౌంటరు దాఖలు చేయాలని ఈసీని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది….
ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లరాజీనామాలను ఆమోదించవద్దు
Related Posts
చదువులో దిట్ట….గోల్డ్ మెడల్ తో పట్టా… బయోటెక్నాలజీలో ఓజిలి విద్యార్థిని ప్రతిభ… పలువురు హర్షం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకుంటూ గోల్డ్ మెడల్…
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో…