ప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందిందని ఆ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఓట్టూరు కిషోర్ కుమార్ యాదవ్ అన్నారు.బుధవారం ఆయన నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసిన ఘనత జగన్ కు దక్కిందని ఆయన అన్నారు. తాము ఎన్నికల ప్రచారం కోసం ఇంటింటికి వెళుతుంటే ఓటర్లు తాము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని, సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి సంజీవయ్య ను ముచ్చట గా మూడో సారి గెలిపిస్తామని చెప్పడం ఆనందం గా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉన్నారని, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దక్కిందని అన్నారు. నాయుడుపేట ఎంపిపి కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మహిళలకు రాజకీయక నామినేటెడ్ పదవుల ఇచ్చి వారి ఎదుగుదల కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ ఒట్టూరు రాధా కిషోర్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మహిళ సాధికారత జరిగిందని అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా సంజీవయ్యను ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పండ్లూరు గ్రామ పంచాయితీ సర్పంచ్ రాజేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ అత్తికాయల శ్రీనివాసులు, నాయుడుపేట మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వంలోనే సమగ్ర అభివృద్ధి ఎన్నికల ప్రచారంలో కిషోర్ యాదవ్ వెల్లడి
Related Posts
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో…
అర్వింద్ గల్ఫ్ బోర్డు వ్యతిరేకి -గల్ఫ్ బాధిత కుటుంబలకు క్షమాపణ చెప్పాలి…టిపిసిసి రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా డిమాండ్
ప్రభాతదర్శిని,(హైదరాబాద్-ప్రతినిధి):గల్ఫ్ బాధితులు బోర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు మందం భీమ్ రెడ్డి మరియు నానిగి దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గల్ఫ్ బాధితులు విదేశాల్లో ఉండి అక్కడే మరణించినప్పటికీ వారి మృతదేహాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం…