ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): బుచ్చిరెడ్డిపాళెం మండలం వ్యవసాయ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్‌ జొన్నవాడ ప్రసాద్ వైసిపి టాటా చెప్పేపి తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం బుచ్చిరెడ్డి పాలెం మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి సమక్షంలో సూరా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి ఆయన టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రశాంతి రెడ్డిని, కోవూరు ఎంఎల్ఏ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలుపించుకున్నేందుకు తాము కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆయనతోపాటు బండెడ్డుల వేణు, దాసరి సుబ్బయ్య, కిష్టయ్య, జొన్నవాడ శేఖర్ చేరారు. అలాగే టిడిపి లో చేరిన అరుంధతివాడ యువతకు ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.