ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవులు భేటీ అయ్యారు. బుధవారం లోకేష్ బాబు నెల్లూరులో జరిగినయువతతో ముఖాముఖి సమావేశ ఎన్నికల ప్రచార కార్యక్రమం కు విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పి.రూప్ కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూమ్ కుమార్ యాదవ్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో పని చేసి జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని కోరారు.