ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్ నగర్కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్ కుమార్, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వి.పి.ఆర్ ఇంటికి చేరుకున్న వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో జనార్థన్, నాగిరెడ్డి శీనయ్య, కోవూరు కృష్ణ, ఆంటోని, ప్రసన్న, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించుకొంటామని పేర్కొన్నారు.
వేమిరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన గండవరం సర్పంచ్
Related Posts
చదువులో దిట్ట….గోల్డ్ మెడల్ తో పట్టా… బయోటెక్నాలజీలో ఓజిలి విద్యార్థిని ప్రతిభ… పలువురు హర్షం
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): పిట్ట కొంచెం… కూతఘనం అనే రీతిలో సూళ్లూరుపేట నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ఉన్న మంగళపూరి చందన్ కుమార్ ఫ్రాంక్లిన్ తన రెండో సోదరి చదువులో దిట్టగా తన ప్రతిభాను కనపరుస్తూ విద్యావేత్తల చేత ప్రశంసలు అందుకుంటూ గోల్డ్ మెడల్…
16 నుంచి వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు…భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నెల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మలోల అన్నారు. గురువారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో…