ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో వైసీపీకి షాక్ ల మీదు షాక్ లు తగులుతున్నాయి. గండవరం గ్రామం, గౌతమ్‌ నగర్‌కు చెందిన సర్పంచి నాగిరెడ్డి సునీల్‌ కుమార్‌, తన అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని వి.పి.ఆర్‌ ఇంటికి చేరుకున్న వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతిరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో జనార్థన్‌, నాగిరెడ్డి శీనయ్య, కోవూరు కృష్ణ, ఆంటోని, ప్రసన్న, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేశారు. కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించుకొంటామని పేర్కొన్నారు.