ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): ఎన్నికల వేళ ఓజిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పున్నేపల్లి ఎంపీటీసీ కల్లూరు విజయమ్మ టిడిపిలో చేరిపోయారు. సోమవారం సూళ్లూరుపేట టిడిపి ఇన్చార్జ్ సమక్షంలో ఓజిలి జిల్లా మండలం టిడిపి అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఈ సందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని భావించి తాము టిడిపిలో చేరామని తెలిపారు. రానున్న ఎన్నికలలో సూళ్లూరుపేట ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గెలుపుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఎంపీటీసీ వెంట ఆ పార్టీకి చెందిన పలువురు గ్రామ నాయకులు టిడిపిలో చేరారు. ఎంపిటిసి టిడిపిలో చేరే విషయంలో విజయ్ కుమార్ నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరి చేరికపై టిడిపి మండల సీనియర్ నాయకులు ప్రకాష్ నాయుడు, దువ్వూరు శ్రీనివాసులురెడ్డి హార్షం వ్యక్తం చేస్తూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు విధాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమని వారు మీడియాతో చేశారు. టిడిపి వైసిపి మండల నాయకులు ఇద్దరూ ఒకే పంచాయతీ కి సంబంధించిన వారికి కావడంతో ఇక్కడ రాజకీయాలు రసవంతంగా మారాయి