ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి మీనా సీరియస్ అయ్యారు. నోటీసులకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై చర్యలకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈవో మీనా లేఖ రాశారు. బహిరంగ సభల్లో సీఎం జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఈవో మీనాకు వైసీపీ 18 సార్లు ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో.. వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు, మరికొన్నింటికి స్పందించలేదు. అయితే చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సీఈవో మీనా సంతృప్తి చెందలేదు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను కూడా జత చేశారు. ప్రజాగళం పేరుతో నిర్వహిస్తోన్న ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
టీడీపీ అధినేతపై ఏపీ సీఈవో మీనా సీరియస్… కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!
Related Posts
సింహపురిలో గర్జించిన కూటమి
ప్రభాతదర్శిని,:(నెల్లూరు-ప్రతినిధి): సింహపురి సీమ జనసంద్రమైంది. నగరమంతా మూడు పార్టీల జెండాలతో, తరలివచ్చిన అభిమానగణంతో చరిత్ర సృష్టించింది. కనివీని ఎగురని రీతిలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రోడ్షో నభూతో న…
హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడు స్థానిక ఎమ్మెల్యే… మాజీ ఎంఎల్ సి వాకాటి నారాయణరెడ్డి ధ్వజం
ప్రభాతదర్శిని, (నాయుడుపేట ప్రతినిధి): స్థానిక ఎమ్మెల్యే హత్య రాజకీయాలు చేసిన దౌర్భాగ్యుడని మాజీ ఎమ్మెల్సీ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నాయుడుపేట లో శుక్రవారం జరిగిన సీనియర్ రాజకీయవేత్త కనుమూరు గోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు కాటూరి ఫణీందర్…