ప్రభాతదర్శిని, (తిరుచానూరు-ప్రతినిధి):ఇటీవల చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి పద్మావతి పురం మాజీ సర్పంచ్, గణపతి నాయుడు ను అలాగే జేబీ రమణ, శ్రీనివాసపురం ఉపసర్పంచ్ సునీల్ చౌదరి ను తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ బుధవారం మర్యాదపూర్వంగా కలిసి ఘనంగా సత్కరించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు సమిష్టిగా అందరి సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. యుగంధర్ రాయల్, శశి, భరత్, శివ రాయల్ శ్రావణ్ కుమార్ రాయల్, వంశీకృష్ణ రాయల్, జయకృష్ణ రాయల్, సురేష్ రెడ్డి ఆనంద్ రాయల్, వినోద్ రాయల్, హరీష్ రాయల్, విద్యాధర్, ముని, సురేష్ సన్మానించిన వారిలో ఉన్నారు.