ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):నాయుడు పేట మండలం పుదూరు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదివే ఇంటర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో సత్తా చాట్టారు. ఇంటర్మీడియట్ సీనియర్ బైపీసీ విద్యార్థులు 92.1%, సీనియర్ ఎంపీసీ 93.3 శాతం ఉత్తీర్ణత సాధించగా, సీనియర్ ఇంటర్ లో 92.6% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగేఇంటర్మీడియట్ జూనియర్ బైపీసీ విద్యార్థులు 90%, జూనియర్ ఎంపీసీ 79.4 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ రౌతు రమోల తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ లో డి.స్పందన 878, డి.తరణి 875, సీనియర్ బైపిసిలో జి. తేజస్విని 931, ఎస్.రేష్మా 924 మార్కులుఈ సాధించి కాలేజీ లో మొదటి స్థానంలో నిలిచినట్టు పేర్కొన్నారు.